logo

నూకంబిక అమ్మవారి సన్నిధిలో దాడి రత్నాకర్అ-చ్యుత దంపతులు

ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు, భక్తుల ఆరాధ్య దేవత, ధూప దీప నైవేధ్యాలతో నిత్య పూజలు అందుకుంటున్న శ్రీ నూకాంబిక అమ్మవారిని తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ దాడి రత్నాకర్‌ అచ్యుత దంపతులు ఆదివారం అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ దాడి రత్నాకర్‌ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీ దాడి రత్నాకర్ దంపతులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీర్వచనాలు భక్తులందరికి కలగాలని, అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని దాడి రత్నాకర్‌ ఆకాంక్షించారు.//

1
843 views